టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ల్యాండింగ్

టేకాఫ్ అయిన  నిమిషాల్లోనే ల్యాండింగ్
  • శంషాబాద్​ టు తిరుపతి ఫ్లైట్​లో టెక్నికల్​ ప్రాబ్లమ్​

శంషాబాద్, వెలుగు: విమానం టేకాప్​ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్ అత్యవసరంగా ల్యాండ్​ చేశారు. ఈ ఘటన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. మంగళవారం ఉదయం 9ఐ877 అల్లీయన్స్ సంస్థకు చెందిన విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి 53 మంది ప్రయాణికులతో తిరుపతికి బయల్దేరింది. 

టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఫ్లైట్​లో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించాడు. వెంటనే అత్యవసరంగా తిరిగి శంషాబాద్ ఎయిర్​పోర్టులోనే ఆ విమానాన్ని ల్యాండ్​ చేశారు. సాంకేతిక లోపం పరిష్కారం కాకపోవడంతో ఎయిర్​లైన్స్​ అధికారులు విమాన సర్వీసును రద్దు చేసి ప్రయాణికులకు రీఫండ్​ చేశారు.