డబ్ల్యూటీఐటీసీ సభ్యుడిగా శ్రీధర్

డబ్ల్యూటీఐటీసీ సభ్యుడిగా శ్రీధర్

హైదరాబాద్​, వెలుగు:  ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యూటీఐటీసీ) గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా టెక్‌‌ఎస్‌‌ఎంఈ  కార్పొరేషన్ సీఈఓ శ్రీధర్ గోనెపల్లి నియమితులయ్యారు. ఐటీ రంగంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆయన ఏఐ, సాంకేతిక కన్సల్టింగ్ రంగాలకు సేవలను అందిస్తున్నారు. ఈ నియామకంపై మండలి చైర్మన్ సందీప్ కుమార్ మక్తాల హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సాంకేతిక నిపుణులను ప్రపంచవ్యాప్తంగా అనుసంధానించడంలో శ్రీధర్ అనుభవం సంస్థకు ఎంతో కీలకం కానుందని,  ఐటీ నిపుణులకు మార్గదర్శకత్వం  చేస్తారని ఆయన పేర్కొన్నారు.