
హైదరాబాద్, వెలుగు: తీన్మార్మల్లన్న.. మాజీ మంత్రి, మేడ్చల్ఎమ్మెల్యే మల్లారెడ్డి శుక్రవారం అసెంబ్లీ వద్ద ఆత్మీయంగా పలకరించుకున్నారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత లాబీ నుంచి ఎమ్మెల్యే అలైటింగ్పాయింట్ వైపునకు మల్లారెడ్డి వస్తుండగా తీన్మార్మల్లన్న ఎదురు పడ్డారు. మల్లన్నను మల్లారెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. ‘‘మేడ్చల్నుంచి తీన్మార్మల్లన్న పోటీ చేస్తే ఎవరో ఒక్క మల్లన్న అసెంబ్లీకి వచ్చేవారు’’ అని మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సభ్యులు తక్కువైతే మద్దతిస్తావా? అని తీన్మార్ మల్లన్న అడుగగా.. చూద్దాంలే అని మల్లారెడ్డి చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత అందరం ఒక్కటే అని ఆయన పేర్కొన్నారు.