- తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్
ముషీరాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా వ్యవసాయ శాఖలో పని చేస్తున్న అధికారులు ప్రమోషన్లకు నోచుకోలేదని తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ చైర్మన్ బి. కృపాకర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్ద కాలంగా వ్యవసాయ శాఖలో ప్రమోషన్లకు అడ్డుగా ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను సర్వీస్ నిబంధనల ప్రకారం వెంటనే ఇవ్వాలని కోరారు.