
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 24 ప్రభుత్వ గురుకుల స్కూళ్లలో తమ ఫ్లాగ్ షిప్ కాగ్నిజెంట్ స్టీమ్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్ కింద ఏఐ మైండ్ స్కార్క్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ -ఎనేబుల్డ్ పర్సనలైజ్డ్, అడాప్టివ్ లెర్నింగ్ టూల్ ను ఏర్పాటు చేస్తోందని కాగ్నిజెంట్ ఇండస్ట్రియల్ ఆపరేషన్స్ హెడ్ రత్నశర్మ వి. కొలచన అన్నారు.
మంగళవారం మియాపూర్ గురుకుల పాఠశాలలో ‘కాగ్నిజెంట్ మైండ్ స్పార్క్ ల్యాబ్’ను గురుకుల సెక్రటరీ సైదులుతో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యార్థులు మైండ్ స్పార్క్ ద్వారా అత్యుత్తమ టెక్నాలజీ విద్యను తరగతి గదిలోనే నేర్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు.