టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 4.8 శాతంతో మరో డీఏ

 టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 4.8 శాతంతో మరో డీఏ

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న కరువు భత్యాలు(డీఏ) అన్నింటినీ మంజూరు చేసింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ  వీసీ సజ్జనర్ తెలిపారు. 2023 జులై నుంచి ఇవ్వాల్సిన 4.8 శాతం డీఏను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. 

ALSO READ : దేవర మూవీపై బిగ్ అప్డేట్ ఇచ్చిన.. డైరెక్టర్ కొరటాల శివ

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ.. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేసింది. తాజా డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించింది...అని టీఎస్ఆర్టీసీ ఎండీ  వీసీ సజ్జనర్ తెలిపారు.