హైదరాబాద్ , వెలుగు: విభజన సమస్యలు, సాగునీటి అంశాలను చర్చించేందుకు తెలంగాణ, ఏపీ సీఎంలు హైదరాబాద్ లో ఈ నెల 13న భేటి కానున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం జగన్ కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారని తెలిసింది.
తెలంగాణ సర్కారు మాత్రం ఈ సమావేశంపై స్పందించలేదు. ప్రధానంగా సాగునీటి అంశాల మీదే చర్చ జరుగుతుందని సమాచారం. గోదావరి జలాల వినియోగంపై ఇదివరకు పలు సార్లు ఇద్దరు సీఎంలు చర్చించారు. చివరి సారిగా వీరి భేటీ గత ఏడాది సెప్టెంబర్ 23న జరిగింది. ఏపీలో మూడు రాజధానుల అంశం వివాదం కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యమేర్పడింది.