అడిషనల్ సీఈఓగా లోకేశ్​కుమార్​

అడిషనల్ సీఈఓగా లోకేశ్​కుమార్​

ఈసీ ఉత్తర్వులు జారీ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ ​స్పీడప్ ​చేసింది. బుధవారం చీఫ్​ఎలక్టోరల్​ఆఫీస్ లో ఆఫీసర్లను నియమిస్తూ ఈసీ ప్రిన్సిపల్​సెక్రటరీ రాహుల్​శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.  జీహెచ్ఎంసీ కమిషనర్​ లోకేశ్​కుమార్ ను అడిషనల్​ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా ఈసీ నియమించింది. ఎక్సైజ్​శాఖ  డైరెక్టర్​గా ఉన్న సర్ఫరాజ్​ అహ్మద్​ను జాయింట్ సీఈఓగా నియమించారు. ఈ స్థానంలో కొనసాగుతున్న రవికిరణ్​(ఐఎఫ్ఎస్)ను రిలీవ్​ చేశారు.