ఈసీ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ స్పీడప్ చేసింది. బుధవారం చీఫ్ఎలక్టోరల్ఆఫీస్ లో ఆఫీసర్లను నియమిస్తూ ఈసీ ప్రిన్సిపల్సెక్రటరీ రాహుల్శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ ను అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా ఈసీ నియమించింది. ఎక్సైజ్శాఖ డైరెక్టర్గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ను జాయింట్ సీఈఓగా నియమించారు. ఈ స్థానంలో కొనసాగుతున్న రవికిరణ్(ఐఎఫ్ఎస్)ను రిలీవ్ చేశారు.