హైదరాబాద్, వెలుగు: స్మార్ట్ఫోన్లు, టెలివిజన్ సేల్స్లో తెలంగాణ టాప్3 మార్కెట్లలో నిలుస్తోందని అమెజాన్ ఇండియా డైరెక్టర్ (స్మార్ట్ఫోన్స్ అండ్ టెలివిజన్స్) రంజిత్ బాబు వెల్లడించారు. ఈ పండుగ సీజన్లో టెలివిజన్, స్మార్ట్ఫోన్ అమ్మకాలలో హైదరాబాద్ ముందంజలో ఉందని చెప్పారు. శామ్సంగ్, వన్ప్లస్, రియల్మి, నార్జో, షియోమి, ఐకూ స్మార్ట్ఫోన్ బ్రాండ్లను, సోనీ, శామ్సంగ్, ఎల్జీ టెలివిజన్ బ్రాండ్లను తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు.
గ్రేట్ఇండియన్ ఫెస్టివల్ ఎక్స్ట్రా హ్యాపీనెస్ డేస్ సందర్భంగా అమెజాన్ ఎక్స్పీరియన్స్ ఎరినా పేరుతో ఒక ఈవెంట్ను ఐఐటీ హైదరాబాద్లో నిర్వహించారు. తెలంగాణలో టీవీలకు డిమాండ్ రెండు రెట్లు పెరిగిందని, 5 జీ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ 60 శాతం ఎక్కువైందని రంజిత్ బాబు వివరించారు.
అమెజాన్ అందించే ప్రొడక్టులపై మీడియాతోపాటు, ఇన్ఫ్లుయెన్సర్లు, కస్టమర్లకు అవగాహన పెంచేలా ఈ అమెజాన్ ఎక్స్పీరియన్స్ ఎరినాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదటి రెండు రోజుల్లోనే 9 కోట్ల మంది విజిటర్లు అమెజాన్ సైట్చెక్ చేసినట్లు బాబు వెల్లడించారు.
తాజా సీజన్లో తమ సేల్స్ జోరుగా సాగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. అమెజాన్కు తెలంగాణ మార్కెట్ కీలకమైనదని వివరించారు. ఆరు పెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, ఒక సార్టేషన్ సెంటర్ తెలంగాణలో పనిచేస్తున్నాయని అన్నారు. డిజిట్ సహకారంతో స్మార్ట్ఫోన్ జీనీ పేరుతో ఒక ఫీచర్ తెచ్చామని చెబుతూ, దీంతో తమకు సరిపోయే స్మార్ట్ఫోన్ను ఎంపిక చేసుకోవడం కస్టమర్లకు సులభమవుతుందన్నారు.