తాడేపల్లిగూడెంలో ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్

తాడేపల్లిగూడెంలో ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎయిర్ పోర్టుల నిర్మాణంలో భాగంగా తాడేపల్లిగూడెంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రప్రభుత్వం. రూ. 1570.64 కోట్లను మంజూరు చేస్తూ భూసేకరణకు కేంద్రం ఆదేశించింది. ఈ ఎయిర్ పోర్టు రాకతో పశ్చిమ గోదావరి జిల్లాకు విమాన సదుపాయాలు మరింత పెరగనున్నాయి. ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపడి, వ్యాపారం, పరిశ్రమలకు ఊతమిస్తుందని చెబుతున్నారు అధికారులు. 
తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే  బొలిశెట్టి శ్రీనివాస్  మాట్లాడుతూ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సహకారంతో ఎయిర్ పోర్ట్ మంజూరయింది. పౌరవిమాన యాన శాఖ మంత్రి రామ్మోహన నాయుడికి కృతజ్ణతలు తెలిపారు. ఉడాన్ స్కీం కింద చిన్న విమానాలు, కౌంటర్లతో ఈ ఎయిర్ పోర్టు ప్రారంభం కానుందని తెలిపారు. ఇప్పటివకే ప్రాధమిక సర్వేలు, భూసేకరణకు అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయని చెప్పారు బొలిశెట్టి.