సమంత లీడ్గా నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంతకు చెందిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. ప్రమోషన్స్లో భాగంగా ఈ చిత్రం గురించి సమంత కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకుంది.
ఈ సినిమాలో తాను నటించాల్సింది కాదని, అసలు ఈ కథను సాయి పల్లవి కోసం రెడీ చేశారని సమంత చెప్పింది. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పింది. మహిళా ప్రధాన కథలతో సినిమాలు రూపొందించాలనే లక్ష్యంతో తమ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించిందని, మొదట ఈ కథను సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకుని డెవలెప్ చేసినట్టు సమంత తెలియజేసింది. అయితే అప్పట్లో సాయి పల్లవి వరుస సినిమాలు, ఇతర కమిట్మెంట్లతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్కు డేట్స్ కేటాయించడం సాధ్యపడలేదని తెలిసింది. దీంతో సాయి పల్లవి ప్లేస్లోకే తానొచ్చినట్టు చెప్పింది.
ఆ తర్వాత రచయితలు, దర్శకులు కథలో కొన్ని మార్పులు చేసి, సమంత ఇమేజ్కు అనుగుణంగా స్క్రిప్ట్ను మలిచారని ఆమె రివీల్ చేసింది. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి.
