వీడియో: డ్రోన్ బాంబు వచ్చి మీద పడితే ఎట్టుంటాదో తెలుసా..? ఇట్టా ఉంటాది..!

వీడియో: డ్రోన్ బాంబు వచ్చి మీద పడితే ఎట్టుంటాదో తెలుసా..? ఇట్టా ఉంటాది..!

ఒక పక్క ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంటే.. మరోపక్క రష్యా, ఉక్రెయిన్ మధ్య అంతకంటే ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. రష్యా రాత్రికి రాత్రే ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్పై డ్రోన్, మిస్సైల్ అటాక్స్తో విరుచుకుపడింది. రష్యా సోమవారం రాత్రి చేసిన ఈ ఎయిర్ స్టైక్స్లో 14 మంది చనిపోయారని, 55 మందికి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రకటించింది.

రష్యా బాంబుల వర్షం కురిపించడంతో కీవ్ నగరంలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. కీవ్ నగరంలోని ఒక పెద్ద అపార్ట్ మెంట్పై రష్యా డ్రోన్ చేసిన దాడిలో ఆ భవనం రూపురేఖలే మారిపోయాయి. ఒక చిన్న డ్రోన్ చేసిన విధ్వంసం అంతాఇంతా కాదు. ఈ డ్రోన్ దాడి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒక డ్రోన్ బాంబు అపార్ట్ మెంట్పై పడిన వెంటనే పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడి దట్టంగా పొగలు వ్యాపించాయి.

రష్యా-ఉక్రెయిన్​మధ్య  జరుగుతున్న యుద్ధం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో  సంవత్సరంలోకి  వచ్చినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఈ యుద్ధంలో  ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. లక్షల సంఖ్యలో సైనికులు  మరణించారు. సామాన్య ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోయారు.  ఎన్నో ఆకాశహర్మ్యాలు నేలమట్టమయ్యాయి.  ఇరుదేశాలు తీవ్రంగా  నష్టపోవడమే కాకుండా పలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. మొదట్లో  ఇరుదేశాల మధ్య సాగిన మాటల యుద్ధం... అణ్వస్త్ర యుద్ధానికి దారితీసి,  మూడో  ప్రపంచ యుద్ధం సంభవిస్తుందేమోనన్న  సందేహంతో ప్రపంచం భీతిల్లింది.  

►ALSO READ | ఎప్పుడు తప్పుగానే అర్థం చేసుకుంటాడు: ఫ్రెంచ్ అధ్యక్షుడిపై ట్రంప్ విమర్శలు

రష్యాపై ఉక్రెయిన్ జూన్ 1న భారీ ఎత్తున డ్రోన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. కార్గో కంటైనర్లలో రష్యా భూభాగంలోకి ఏఐ ఆటోనామస్ డ్రోన్ లను పంపి ఎయిర్ బేస్ లలో నిలిపి ఉంచిన 40 బాంబర్ విమానాలను పేల్చేసింది. యుద్ధ విమానాలను పేల్చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలను కూడా ఉక్రెయిన్ విడుదల చేసింది. ఉక్రెయిన్ బార్డర్ నుంచి ఏకంగా రెండు, మూడు వేల కిలోమీటర్ల దూరంలో రష్యా భూభాగంలోని ఎయిర్ బేస్లపై ఈ దాడులు జరిగాయి.

మూడేండ్ల క్రితం యుద్ధం మొదలైనప్పటి నుంచీ ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్లో రష్యాకు ఇంత పెద్ద నష్టం వాటిల్లడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్ పైకి లాంగ్ రేంజ్ మిసైల్స్ ను ప్రయోగించేందుకు వీలుగా సుదూర ప్రాంతంలో మోహరించిన టీయూ95, టీయూ22 బాంబర్ విమానాలను, ఒక ఏ50 నిఘా విమానాన్ని పేల్చివేసినట్టు ఈ మేరకు ఉక్రెయిన్ ఆర్మీ అధికారులు వెల్లడించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.