
అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీచీఫ్ అసిమ్ మునీర్ ను అమెరికా ప్రొటెస్టర్లు ఓ రేంజ్ తో బూతులు తిట్టారు. నిరసన తెలుపుతున్న అమెరికాలోని పాకిస్తాన్ పౌరులు కంట పడ్డ మునీర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సామూహిక హంతకుడు, సిగ్గు చేటు అంటూ నినాదాలు చేశారు. మునీర్ పేరు పెట్టి మరీ నిరసనకారులు తిడుతున్న తిట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
అమెరికాలో పాకిస్తానీ మూలాలున్న వ్యక్తుల నుంచి మునీర్ భారీ ఎత్తున వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అమెరికాలోని పాకిస్తానీ డయాస్పోరా అసిమ్ మునీర్ను సామూహిక హంతకుడుగా ప్రకటించింది. మునీర్ను రాబందు అని పిలిచారు. మునీర్ కాశ్మీర్ గురించి మాట్లాడే ప్రతయ్నం చేయగా..పాకిస్తాన్ లోపల విఫలమయ్యారని.. కాశ్మీర్ గురించి ఏం మాట్లాడుతావ్ అని విమర్శించారు.
ALSO READ | ఫడ్నవీస్ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఎమర్జెన్సీ టైంలో జైల్లో ఉన్నోళ్లకు డబుల్ పెన్షన్
'షేమ్ ఆన్ యు', 'ఇస్లామాబాద్ కా ఖాటిల్' వంటి నినాదాలు మునీర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాదు మునీర్ 'మాస్ హంతకుడు' అంటూ చిత్రీకరించిన బ్యానర్లు వీధుల్లో ప్రదర్శించారు. 'అసిం మునీర్, నువ్వు పిరికివాడివి' అంటూ ప్రొటెస్టర్లు చేసిన నినాదాలు కూడా వీడియోలలో వినిపించాయి.
ఓ పక్క పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు అమెరికా పర్యటనను మునీర్ గొప్పగా చెప్పుకుంటున్నారు. భారత్ దౌత్యపరమైన చర్యలతో ప్రపంచ దేశాలతో దగ్గరవుతున్న క్రమంలో మునీర్ పర్యటనను పాకిస్థాన్ సాహసోపేతమైన చర్యగా చెప్పుకుంటోంది.
ప్రొటెస్టర్లలో చాలా మంది మునీర్ ను నిరంకుశ నియంతగా పిలిచారు. ప్రజాస్వామ్య హత్యకు మునీరే కారణమని ఆరోపించారు. నియంతలు ఎదిగితే ప్రజాస్వామ్యం చనిపోతుందని ఆందోళన కారులు నినదించారు.
ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని PTI విదేశీ విభాగం కూడా ఆందోళన వీడియోలను తిరిగి షేర్ చేసింది. ఈ వీడియోలో నిరసనకారులు హోటల్ వెలుపల గుమిగూడి పాకిస్తాన్ అత్యున్నత సైనిక కమాండర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నట్లు కనిపించింది.
భారత్, పాకిస్తాన్ల మధ్య శతృత్వాన్ని రెచ్చగొట్టేలా మునీర్ బహిరంగ ప్రసంగం చేసినప్పటి నుంచిఆన్లైన్లో విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా అమెరికాలో పాకిస్తాన్ డయాస్పోరా తీవ్ర విమర్శలు, నినాదాలు చేయడంతో అసిం మునీర్ అమెరికా పర్యటన చర్చనీయాంశం అయింది.