- చైర్మన్గా ధర్మారావు నియామకం
హైదరాబాద్, వెలుగు: ఆరుగురు సభ్యులతో రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే ధర్మారావును నియమిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం వెల్లడించారు.
సభ్యులుగా నాగురాం రామ్ జీ, పద్మజా రెడ్డి, రాజమౌళి గౌడ్, ప్రతాప్ , రవీంద్ర విశ్వనాధ్ లను నియమించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించిన నేతలకు ఈ కమిటీ నోటీసులు జారీ చేస్తుంది. వారి నుంచి వివరణ తీసుకోవటం, పార్టీ ప్రెసిడెంట్ కు నివేదించటం వంటి పనులను కమిటీ చేయనున్నట్లు తెలుస్తోంది.