వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ స్పీడ్ పెంచింది. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో తెలంగాణ ముఖ్య నేతలు కిషన్ రెడ్డి, డికె అరుణ, బండి సంజయ్, తరుణ్ చుగ్, ప్రకాశ్ జవడేకర్, ఈటెల రాజేందర్, సునీల్ బన్సల్ ఉన్నారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన రాజకీయ వ్యూహాలపై అమిత్ షాతో చర్చించారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై అమిత్ షా కు వివరించారు నేతలు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం, చేరికలు, బీఆర్ఎస్– కాంగ్రెస్ ను ఎదుర్కోవడంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. షా తాజా టూర్ రద్దయిన కావడంతో మరో రోజు రాష్ట్రానికి రావాలని నేతలు కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన పరిస్థితులను కూడా అమిత్ షాకు వివరించారు.