బీజేపీ 4వ లిస్ట్ రిలీజ్ : జనసేన సీట్లపై ఇవ్వని క్లారిటీ

బీజేపీ 4వ లిస్ట్ రిలీజ్ : జనసేన సీట్లపై ఇవ్వని క్లారిటీ

నాలుగో లిస్టు రిలీజ్ చేసింది బీజేపీ. 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.  చెన్నూరు నుంచి దుర్గం అశోక్, ఎల్లారెడ్డి నుంచి షుభార్ రెడ్డి, వేములవాడ నుంచి తుల ఉమా, హుస్నాబాద్  బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి. వికారాబాద్ నుంచి నవీన్ కుమార్ తో పాటు  గద్వాల, మిర్యాల గూడ అభ్యర్థులను ప్రకటించింది. 

అయితే జనసేన పార్టీకి కేటాయించే సీట్ల విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటి వరకు వంద మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. మరో 19 స్థానాలపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇందులో జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు.. ఏయే నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది అనే విషయంలో ఆసక్తి నెలకొంది. 

జనసేన డిమాండ్ చేస్తున్న కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు బీజేపీ.. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందనే ప్రచారం జోరుగా ఉంది. ఈ రెండు సీట్లపై బీజేపీలోని నేతలు సైతం గట్టిగానే పట్టుబడుతున్నారు. నామినేసన్లకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో.. పొత్తు సీట్లపై ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు నవంబర్ 12 లేదా 13న బీజేపీ మేనిఫెస్టో రిలీజ్  చేయనుంది.  

 

  • చెన్నూరు-దుర్గం అశోక్‌
  • ఎల్లారెడ్డి సుభాష్‌రెడ్డి
  • వేములవాడ-తుల ఉమ
  • హుస్నాబాద్‌-శ్రీరామ్‌ చక్రవర్తి
  • సిద్ధిపేట-దూది శ్రీకాంత్‌రెడ్డి
  • వికారాబాద్‌-నవీన్‌ కుమార్‌
  • కొడంగల్‌-బంటు రమేష్‌ కుమార్‌
  • గద్వాల్‌-బోయా శివ
  • మిర్యాలగూడు సాదినేని శ్రీనివాస్‌
  • మునుగోడు-చలమల కృష్ణారెడ్డి
  • నకిరేకల్ - మొగులయ్య 
  • ములుగు - అజ్మీర ప్రహ్లాద్ నాయక్