
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 19న పొద్దున 11.30 నిమిషాలకు మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ రోజు మధ్యాహ్నం 2.30నిలకు గవర్నర్ నరసింహన్ ను కలిసిన కేసీఆర్ తన నిర్ణయాన్ని తెలియజేశారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుండి విస్తరణకు సంబంధించి ప్రకటన వెలువడింది. మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి కావలసిన ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.