
తమ ఉద్యోగాలను రెగ్యులర్చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు జగిత్యాల ఆర్డీఓ ఆఫీస్ ముందు రిలే దీక్షలు చేస్తున్నారు. గురువారం కృష్ణాష్టమి సందర్భంగా దీక్షా శిబిరం ముందు కృష్ణుని రూపంలో కేసీఆర్ చిత్రపటం గీసిన ఉద్యోగులు.. దాని ముందు పడుకొని దండం పెట్టి రెగ్యులర్ చేయాలని వేడుకుంటూ నిరసన తెలిపారు.