
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని గతంలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. బేగంబజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి గురువారం నాంపల్లి కోర్టుకు హాజరు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రెండోసారి కోర్టుకు హాజరయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరయ్యారు.
నల్గొండ టూ టౌన్ పీఎస్, బేగంబజార్ పీఎస్, మెదక్ జిల్లా కౌడిపల్లి పీఎస్ పరిధిలో నమోదైన మూడు కేసుల్లో వ్యక్తిగతంగా జడ్జి ముందు హాజరయ్యారు. సీఎం కోర్టుకు హాజరు కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు హాల్ దగ్గరకు ఇతరులను అనుమతించలేదు. రేవంత్ రెడ్డిపై ఈ కేసులు నమోదైన సమయంలో ఆయన పీసీసీ చీఫ్ గా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డిపై కేసులు నమోదు చేయించిందని కాంగ్రెస్ ఆరోపించింది.
కోర్టులో ఏం జరిగిందంటే.. జడ్జి ఎదుట సీఎం ఏం చెప్పారంటే..
* తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని కోర్టుకు తెలిపిన సీఎం రేవంత్
* పోలీసులు చెప్తున్నవి అన్నీ కూడా అవాస్తవాలు
* తాను ఎక్కడ ఎలాంటి తప్పు చేయలేదన్న రేవంత్ రెడ్డి
* రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ నమోదు చేసుకున్న కోర్టు
* జూన్ 12వ తేదీన తీర్పు ప్రకటించనున్న నాంపల్లి స్పెషల్ కోర్టు
* విచారణ అనంతరం కోర్టు నుంచి తిరిగి వెళ్ళిపోయిన సీఎం రేవంత్ రెడ్డి
* బేగంబజార్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కోర్టుకు సీఎం