తెలంగాణ కమ్యూనికేషన్ కో -ఆర్డినేటర్​గా సుజాత పాల్

తెలంగాణ కమ్యూనికేషన్  కో -ఆర్డినేటర్​గా సుజాత పాల్

న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం 24 రాష్ట్రాలు/యూటీలు/నార్త్ ఈస్ట్ స్టేట్స్ కు కమ్యూనికేషన్ కోఆర్డినేటర్లను నియమించింది. అందులో భాగంగా తెలంగాణ కమ్యూనికేషన్ కో-ఆర్డినేటర్ గా సుజాత పాల్ కు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం సీడబ్ల్యూసీ మెంబర్, మీడియా కమిటీ చైర్మన్ పవన్ ఖేరా ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ గా డిఆర్. అనిల్ కుమార్ కు హైకమాండ్ బాధ్యతలు కట్టబెట్టింది.