గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన , రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, రాష్ట్ర సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. కాంగ్రెస్ నుంచి పోటీకి 1000 కి పైగా ఆశావాహులు దరఖాస్తు చేసుకోవడంతో అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. అయితే దాదాపు 20 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. దాదాపు 40 స్థానాల్లో ఇద్దరు లేదా ముగ్గురు పోటీ పడుతుండటంతో ఎన్నికల కమిటీ చర్చిస్తోంది.
ఈ అభ్యర్థులు దాదాపు ఖరారు
- నల్గొండ: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
- అలంపూర్: సంపత్ కుమార్
- నాగార్జున సాగర్: కుందూరు జైవీర్ రెడ్డి
- వరంగల్ తూర్పు: కొండా సురేఖ
- కామారెడ్డి: షబ్బీర్ అలీ
- మంచిర్యాల: ప్రేమ్ సాగర్ రావు
- మంథని: శ్రీధర్ బాబు
- ఆందోల్ : దామోదర రాజనర్సింహా
- పరిగి: రామ్మోహన్ రెడ్డి
- కొడంగల్ : రేవంత్ రెడ్డి
- హుజూర్ నగర్: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కోదాడ: పద్మావతి
- మధిర: భట్టి విక్రమార్క
- జగిత్యాల: జీవన్ రెడ్డి
- ములుగు: సీతక్క
- భద్రాచలం:పొదెం వీరయ్య
- సంగారెడ్డి: జగ్గారెడ్డి
- ఆలేరు :బీర్ల ఐలయ్య
- ఇబ్రహీం పట్నం: మల్ రెడ్డి రంగారెడ్డి
- వికారాబాద్ : గడ్డం ప్రసాద్