రఘునందన్​కు మద్దతుగా బీజేపీ శ్రేణుల ప్రచారం

రఘునందన్​కు మద్దతుగా బీజేపీ శ్రేణుల ప్రచారం

దుబ్బాక, వెలుగు: బీజేపీ దుబ్బాక అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్​ రావుకు మద్దతుగా బీజేపీ శ్రేణులు ఆదివారం మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.  పట్టణ కేంద్రంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సుంకోజి ప్రవీణ్​కుమార్​, దుంపలపల్లిలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి తొగుట రవీందర్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్​​ బీజేపీకి ఓటెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్​ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుందన్నారు.

ఉప ఎన్నికల్లో రఘునందన్​గెలిచిన తర్వాతనే దుబ్బాకలో కొత్త బస్టాండ్​, వంద పడకల ఆస్పత్రి, డబుల్​ బెడ్రూమ్​ల పంపిణీ, సీసీ రోడ్లు, ప్రతి గ్రామంలో హైమాస్​ లైట్లు, అక్భర్​పేట-భూంపల్లి మండలం,  జాతీయ రహదారి వచ్చాయన్నారు. మరోసారి దుబ్బాక ప్రజలు రఘునందన్​రావును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.