హనుమకొండ సిటీ, వెలుగు: ఈ నెల 9న వరంగల్ నగరంలో తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల 20వ మహాసభ, రాష్ట్ర సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ బీసీ ఉద్యోగుల కార్యదర్శి నీలారపు రాజేందర్ తెలిపారు.
మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్లను బుధవారం హనుమకొండలో ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ శాఖ బీసీ ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చి, మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
