అప్పుల బాధతో తెలంగాణ రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో తెలంగాణ రైతు ఆత్మహత్య

నర్సాపూర్(జి) వెలుగు: అప్పుల బాధతో  రైతు సూసైడ్ చేసుకున్న ఘటన నిర్మల్​జిల్లాలో  జరిగింది. నర్సాపూర్​(జి)మండలంలోని నసీరాబాద్ గ్రామానికి చెందిన మల్లెల గంగాధర్(37) తనకున్న రెండెకరాలతో పాటు మరో ఎకరం భూమిని కౌలుకు తీసుకొని పత్తి, మొక్కజొన్న పంటను వేశాడు.పంటల సాగుకు దాదాపు రూ.3 లక్షల అప్పు అయ్యింది. 

అయితే, అప్పుల భారం మీదపడటంతో రైతు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. సోమవారం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. ఆపై ఇంటికి చేరుకొని విషయాన్ని కుటుంబీకులకు చెప్పడంతో వారు వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రైతు మృతి చెందాడు. మృతుడి భార్య  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.