చేర్యాల, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో చేర్యాల పట్టణం విధ్వంసానికి గురైందని తెలంగాణ ఫిషర్ మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ఫెడరేషన్ చైర్మన్మెట్టు సాయికుమార్ఆరోపించారు. ఆదివారం చేర్యాల పట్టణంలోని 2, 6వ వార్డుల్లో ఆయన మున్సిపల్ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని, పార్టీ 2వ వార్డు అభ్యర్థి ముస్త్యాల తేజ సంజీవులు, 6వ వార్డు అభ్యర్థి ముస్త్యాల కృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
