
- విద్యావేత్తలు, ఐఏఎస్లు, వీసీలతో ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విద్యావిధానం రూపకల్పన కోసం పలు కమిటీలను సర్కారు ఏర్పాటు చేసింది. వివిధ అంశాలపై స్టడీ రిపోర్టు ఇవ్వాలని 11 వర్కింగ్ కమిటీల ను నియమించింది. ఈ కమిటీలు ఇచ్చే రిపోర్టుల ఆధారంగా సమగ్రమైన తెలంగాణ విద్యా విధానాన్ని రూపొందించనున్నారు. కమిటీలకు బాధ్యులుగా ఐఏఎస్లు, వీసీలు, విద్యావేత్తలను నియమించారు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ జాయ్ లర్నింగ్ ఎన్విరాన్ మెంట్ అంశంపై కన్వీనర్గా ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని నియమించారు. ఎడ్యుకేషన్ టెక్నాలజీ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ అంశానికి కన్వీనర్గా టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి, కరికులమ్, పెడగోజీ కల్చర్ అండ్ వ్యాల్యూ స్ ఎడ్యుకేషన్, గవర్నెన్స్, అకౌంటెబిలిటీ అంశాలకు రిటైర్డ్ ఐఏఎస్ ఐవీ సుబ్బారావు, హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పై జేఎన్టీయూ వీసీ టీకేకే రెడ్డి, ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ఎర్లీ చైల్డ్ వుడ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లెర్నింగ్పై రిటైర్డ్ ఐఏఎస్ రంజీవ్ ఆచార్య, ఈక్వాలిటీ, యాక్సెస్, స్టూడెంట్ సంక్షేమంపై ఓపెన్ వర్సి టీ వీసీ ఘంటా చక్రపాణిని కన్వీనర్లుగా నియమించారు.