
- గవర్నమెంట్ ఆర్డర్స్ జారీ
నిజామాబాద్, వెలుగు: నేషనల్ పసుపు బోర్డు ఆఫీస్ కోసం నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ బిల్డింగ్ను స్టేట్ గవర్నమెంట్ కేటాయించింది. బిల్డింగ్ విస్తీర్ణం 4,052 చదరపు ఫీట్లుండగా ప్రతి ఫీట్కు రూ.13 చొప్పున నెలకు రూ.52,676 అద్దె చెల్లించాలని ఆర్అండ్బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ రాష్ట్రంలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మాదిరి రూరల్ సెగ్మెంట్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మించింది.
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తన క్యాంప్ ఆఫీస్ను సొంతగా ఏర్పాటు చేసుకున్నారు. ఏడాదిన్నర నుంచి ఖాళీగా ఉన్న ఈ భవనాన్ని కిరాయిపై పసుపు బోర్డుకు కేటాయించాలని ఎంపీ అర్వింద్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రసుతం పసుపు బోర్డు ఆఫీస్ సిటీలోని ఆర్యనగర్లో ఒక చిన్న రూమ్లో నడుస్తున్నది.