- ప్రభుత్వం అంగీకరించిందన్న టీజేఈయూ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి
సైఫాబాద్, వెలుగు: జలమండలిలో 735 కొత్త పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం సైఫాబాద్లోని ఖైరతాబాద్ జలమండలి కేంద్ర కార్యాలయంలో ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, ఎండీ అశోక్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక కార్మిక సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. తాజా నియామకాలు తొలి విజయమని, దీని ద్వారా ప్రమోషన్ల అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీజేఈయూ అసోసియేట్ ప్రెసిడెంట్ అల్లి శ్రావణ్ కుమార్, మేవ ప్రధాన కార్యదర్శి సయ్యిద్ అక్తర్ అలీ, నేతలు ఆనంద్ రెడ్డి, సి. రాజు, సిహెచ్. ప్రవీణ్ కుమార్, మజారుద్దీన్, తిరుపతి, బి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.
