
- పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్
మేడిపల్లి, వెలుగు: క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పీసీసీ చీఫ్మహేశ్ కుమార్గౌడ్అన్నారు. బోడుప్పల్లోని ఓ గార్డెన్స్లో విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 29వ జాతీయ ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.
కరాటేలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాలని సూచించారు. కాంగ్రెస్మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి తోటకూర వజ్రేశ్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిశోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు పద్మారెడ్డి, సీసా వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.