- జస్టిస్ ధర్మాధికారికి విద్యుత్ సంస్థల రిపోర్టు
హైదరాబాద్, వెలుగు: రిలీవ్ చేసిన ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగుల్లో జస్టిస్ధర్మాధికారి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న 76 మందిని చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ విద్యుత్ సంస్థలు ప్రకటించాయి. ఈమేరకు ఉద్యోగుల వివరాలతో జస్టిస్ ధర్మాధికారికి నివేదిక అందజేశాయి.
మొత్తం 256 మంది ఉద్యోగులు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించిన అధికారులు కేవలం 76 మంది మాత్రమే అర్హులని, 180 మంది ఉద్యోగుల వివరాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేల్చారు. ఈ 76 మంది ఉద్యోగులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి సంస్థలో చేర్చుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి నవంబర్ 2, 3 తేదీల్లో జస్టిస్ ధర్మాధికారితో తెలుగు రాష్ట్రాల విద్యుత్సంస్థల అధికారులు భేటీ కానున్నారు.

