హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో సఫాయి చార్జీలను రాష్ట్ర సర్కార్ పెంచింది. ఒక్కో బెడ్డు వద్ద చేసే పారిశుధ్య ఖర్చును రూ.5 వేల నుంచి రూ.7,500కు పెంచుతూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. హాస్పిటళ్లతో పాటు నర్సింగ్ స్కూళ్లు, హాస్టళ్లకు కూడా ఇదే వర్తిస్తుందని జీవోలో పేర్కొంది. 200 కంటే ఎక్కువ బెడ్లు ఉన్న హాస్పిటళ్లకు వేర్వేరుగా టెండర్లు పిలిచి, కాంట్రాక్ట్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. 200 కంటే తక్కువ బెడ్లు ఉన్న హాస్పిటళ్లను గ్రూపులుగా విభజించి, వాటికి వేరుగా టెండర్లు పిలవాలని పేర్కొన్నారు. టెండర్ల బాధ్యత, కాంట్రాక్టర్లతో పని చేయించే బాధ్యతను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే హెల్త్ సొసైటీలకు అప్పగించారు. హాస్పిటల్లోని ఓపెన్ ఏరియాలో ప్రతి 27 వేల చదరపు అడుగులకు ఒక వర్కర్, హాస్పిటల్ లోపల చేసే పనికి ప్రతి 7 వేల చదరపు అడుగులకు ఒక వర్కర్ను నియమించాలని పేర్కొన్నారు. కాగా, హాస్పిటళ్లలో పేషెంట్ బెడ్డు వద్ద నీట్గా ఉంచే బాధ్యత ఆయా కాంట్రాక్టర్లపైనే ఉంటుంది. కార్మికుల జీతాల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
ప్రభుత్వ దవాఖాన్లలో సఫాయి చార్జీల పెంపు
- హైదరాబాద్
- March 14, 2022
లేటెస్ట్
- LSG vs RR: లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్ కు చేరువలో రాజస్థాన్ రాయల్స్
- Cyber Crime : ముంబై సీబీఐ పేరుతో.. రూ.35 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
- తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాక: ఎంపి అభ్యర్థి వంశీకృష్ణ
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- JEE అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. అప్లయ్ చేసుకోండిలా
- చంద్రబాబు హయాంలో బడ్జెట్ తీరు.. ఉపాధి కల్పన..
- IPL 2024: మెరిసిన రాహుల్, దీపక్ హుడా.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
- 95 మంది పిల్లల అక్రమరవాణా..రక్షించిన యూపీచైల్డ్ కమిషన్
- చంద్రబాబు సూపర్ 6హామీలకు అయ్యే ఖర్చు.. సాధ్యాసాధ్యాలు
- భారీగా విదేశీ మద్యం పట్టివేత
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- హైదరాబాద్ ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్ వాటర్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- హైదరాబాద్ లో లైట్ బీర్ల కొరత.. ఎక్కడ అడిగినా నో స్టాక్ అంటున్న సిబ్బంది