
- సుప్రీంలో రాష్ట్ర సర్కారు పిటిషన్
హైదరాబాద్, వెలుగు : కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు తెలిపింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం 2021లో ఇచ్చిన గెజిట్ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రెండు వారాల కిందట సుప్రీంకోర్టులో రాష్ట్ర సర్కారు రిట్పిటిషన్ను దాఖలు చేసింది.
ఆ పిటిషన్ ను జస్టిస్ సంజయ్ఖన్నా, జస్టిస్సంజయ్కుమార్లతో కూడిన బెంచ్ విచారించాల్సి ఉంది. అయితే, బెంచ్లో జస్టిస్సంజయ్కుమార్ తెలుగు రాష్ట్రాల కేడర్కు చెందిన వ్యక్తి కావడంతో.. పిటిషన్ను విచారించలేమని బెంచ్స్పష్టం చేసింది. మరో బెంచ్కు పిటిషన్ను బదిలీ చేస్తామని పేర్కొంది. ఈ పిటిషన్దీపావళి తర్వాత మరో బెంచ్విచారించే అవకాశం ఉంది.