
హైదరాబాద్: ఐఏఎస్ ఆమ్రపాలికి ఉన్న అదనపు పోస్టులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. HMDA జాయింట్ కమిషనర్ , మూసీ రివర్ బోర్డ్కు ఎండీ, గ్రోత్ కారిడార్కు ఎండీగా ఉన్న పోస్టులను తొలగిస్తూ GHMC కమిషనర్గా ఆమ్రపాలి పూర్తి స్థాయి బాధ్యతలను రేవంత్ సర్కార్ అప్పగించింది. ఇక మీదట GHMC కమిషనర్గా ఆమ్రపాలి పూర్తి స్థాయిలో పని చేయనున్నారు.
నగర ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు పెరిగిపోతుండటం,హైదరాబాద్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఆమ్రపాలికి ఉన్న అదనపు పోస్టులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి సిటీలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం పరిధిలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి ఇటీవల రాష్ట్ర సర్వీసులకు వచ్చిన విషయం విదితమే.
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి కాటా, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా కోట శ్రీవాత్స, మూసీ రివర్ డెవలప్ మెంట్ ఎండీగా దాన కిషోర్, HMWS ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మయాంక్ మిట్టల్, HMDA మేనేజింగ్ డైరెక్టర్గా సర్ఫరాజ్ అహ్మద్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా చాహత్ బాజ్ పాయ్ను ప్రభుత్వం నియమించింది. చాహత్ బాజ్ పాయ్ ఐటీడీఏ పీవోగా కూడా గతంలో పనిచేశారు. అసిఫాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహించారు.