728 డ్రోన్లు, 13 మిసైల్స్తో ఉక్రెయిన్పై రష్యా దాడి

728 డ్రోన్లు, 13 మిసైల్స్తో  ఉక్రెయిన్పై రష్యా దాడి

కీవ్​: రష్యా, ఉక్రెయిన్​ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. మంగళవారం రాత్రి 728 డ్రోన్లు, 13 మిసైల్స్​తో ఉక్రెయిన్​పై రష్యా దాడి చేసింది. దాదాపు మూడేండ్లుగా రెండు దేశాల మధ్య నడుస్తున్న యుద్ధంలో ఈ స్థాయిలో డ్రోన్లను, మిసైల్స్​ను రష్యా ప్రయోగించడం ఇదే తొలిసారి. దాడుల వల్ల లూట్స్​క్ నగరంతోపాటు ఉక్రెయిన్​ నార్త్​వెస్ట్​లోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ జెలన్​స్కీ తెలిపారు. 

లూట్స్​క్​ నగరం అనేది ఉక్రెయిన్​ ఆర్మీకి వైమానిక స్థావరం. ఈ సిటీ భారీగా దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది. అయితే.. తాజా దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఉక్రెయిన్​ అధికారులు వెల్లడించారు. డ్రోన్లను, మిసైల్స్​ను ఎప్పటికప్పుడు కూల్చేశామని తెలిపారు. కొన్నిరోజులగా ఉక్రెయిన్​ సైనిక స్థావరాలే టార్గెట్​గా రష్యా దాడులకు తెగబడుతున్నది. జులై 4న కూడా ఇలాంటి దాడే చేసింది.