
- తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అసోసియేషన్
బషీర్బాగ్, వెలుగు: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో తీసుకురావడంపై తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. సోమవారం హైదరాబాద్ సెక్రటేరియట్ ఎదుట సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ అసోసియేషన్ నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ... ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి తాము అండగా నిలుస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు ఉంటుందని, ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పారు.