- టీజీబీ అడ్లూర్ ఎల్లారెడ్డి మేనేజర్ తుమ్మ సంపత్ కుమార్
సదాశివనగర్, వెలుగు: తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఖాతా దారులు బ్యాంక్ ద్వానా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అడ్లూర్ ఎల్లారెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ తుమ్మ సంపత్ కుమార్ అన్నారు. బుధవారం బ్యాంక్ పరిధిలోని కుప్రియల్ గ్రామ పంచాయితీ వద్ద ఏర్పాటు చేసిన ఖాతా దారుల సమావేశంలో మాట్లాడారు.. పేద ప్రజలు, రైతులు, నిరుద్యోగుల కోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతీ ఒకరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఖాతా దారులకు బ్యాంక్ ద్వారా విద్యా, బంగారం, వ్యవసాయ, చిన్న పరిశ్రమలు, సామాజిక భధ్రత పథకాలు, అటల్ పెన్షన్, నగదు రహిత లావా దేవీలు, సైబర్ మోసాలపై జాగ్రత్తల పై వివరించారు. ఈ సందర్భంగా కళాజాత ఆట పాటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ రాజగోపాల్, శ్రీకాంత్, సర్పంచ్ జంగంగారి రాజమణి, ఉప సర్పంచ్ గున్నాల అన్వేశ్ గౌడ్, బ్యాంక్ మిత్ర కాటిపల్లి భూపాల్ రెడ్డి, గ్రామ సంఘాల వీవోఏలు, డ్యాక్రా సంఘాల సీఏలు, ప్రతినిధులు, ఆశ వర్కర్లు, ఖాతాదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
