పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దేశంలో అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నది తెలంగాణలోనే అని కౌంటర్ ఇచ్చారు. ఏ రాష్ట్రంలోనూ లేనంత అత్యధిక వ్యాట్ ను తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. ద్రవ్యోల్బణం జాతీయ సగటు 6.99శాతంగా ఉంటే.. తెలంగాణలో మాత్రం అది 7.66 శాతంగా ఉందని ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
దేశవ్యాప్తంగా నిరుద్యోగిత శాతం తగ్గుతుంటే తెలంగాణలో మాత్రం పెరుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఒక్క కుటుంబంలో మాత్రమే ఉద్యోగ శాతం పెరిగిందని చురకలంటించారు. పోలీసుల వేధింపులు కూడా తెలంగాణలోనే ఎక్కువని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Telangana has the Highest LPG, Petrol & Diesel Prices:
— G Kishan Reddy (@kishanreddybjp) April 19, 2022
?????? - Telangana State has one of the Highest VAT rates.
????????? in Telangana (7.66%) - above national average (6.99%).