తెలంగాణలో వచ్చే నాలుగు వారాలు కీలకం

తెలంగాణలో వచ్చే నాలుగు వారాలు కీలకం

తెలంగాణలో రానున్న రోజుల్లో ఎప్పుడూ చూడని పరిస్థితులు చూడబోతున్నామన్నారు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. గతంలో నమోదైన కేసులతో పోల్చితే... ఒకే రోజులో ఐదు రెట్లు కరోనా కేసులు పెరగనున్నాయన్నారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాపించే అవకాశం ఉందన్నారు. ఒమిక్రాన్ కేసులు కూడా ఒకేసారి పెరుగుతాయన్నారు. రాష్ట్రంలో, దేశంలో వచ్చే రెండు నుంచి నాలుగు వారాలు అత్యంత కీలకమన్నారు. ఇది మూడో వేవ్ కు ప్రారంభం అన్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్, సంక్రాంతి వేడుకలు వస్తున్నాయన్నరు. పబ్లిక్ మూమెంట్ భారీగా ఉంటుందన్నారు. దీంతో వచ్చే సంక్రాంతికి కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం అవుతుందన్నారు డీహెచ్.  వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లకు కూడ కోవిడ్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. 

థర్డ్ వేవ్ ప్రారంభం అయింది అనుకోవచ్చన్నారు. ఓమిక్రాన్ వ్యాధి లక్షణాలు 90శాతం మందిలో కనిపించడం లేదన్నారు. లక్షణాలు లేని వ్యక్తిని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. సౌత్ ఆఫ్రికాలో టెస్టులు పూర్తిగా నిలిపివేశారన్నారు డీహెచ్. గతంలో కరోనా రెండు వేవ్ లు వచ్చినప్పుడు కోవిడ్ పై విజయం సాధించామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. థర్డ్ వేవ్ అరికట్టేందుకు చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉందామన్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇంతకుముందే ఎప్పుడూ లేనంత పరిస్థితి మనం చూడవచ్చన్నారు డీహెచ్. వ్యాధి లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. డెల్టా వేరియంట్ కంటే 30 రేట్లు వేగంగా  ఈసారి కరోనా కేసులు విస్తరిస్తాయనే మాటలు వినిపిస్తున్నాయన్నారు.

వైరస్ కన్నా ప్రమాదకరమైనది భయమన్నారు. మాస్క్ మన జేబులో ఉండే వ్యాక్సిన్ లాంటిందన్నారు. దాన్ని జేబు నుంచి నోటికి ముక్కుకు కలిపి తగిలించుకోవాలనుకున్నారు. మన దగ్గర ఉన్న మరో బలమైన ఆయుధం వ్యాక్సిన్ అన్నారు.అంతా తప్పకుండా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలనుకున్నారు. ఈ థర్డ్ వేవ్ కరోనాకు ముగింపు అన్నారు డీహెచ్. ఎక్కడ అజాగ్రత్త ఉంటుందో అక్కడే వైరస్ పొంచి ఉంటుందన్నారు డీహెచ్. తెలంగాణలో జీనోమ్ సీక్వెన్స్ చేసే ల్యాబ్ రెండే ఉన్నాయన్నారు. వేరియంట్ ఏదైనా సరే ముందు ట్రీట్ మెంట్ తీసుకోవాలనుకున్నారు. అపోహాలు ఉంటే నమ్మకూడదని హితవు పలికారు.