కోడ్ ఉల్లంఘించిన హోం మంత్రి మహమూద్ అలీ

కోడ్ ఉల్లంఘించిన హోం మంత్రి మహమూద్ అలీ
  • టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి ఓటేశానని చెప్పిన మంత్రి

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు హోంమంత్రి మహమూద్ అలీ. మలక్ పేటలోని పోలింగ్ కేంద్రంలో ఓటేసిన అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. మీడియా ప్రతినిధులు ఓటింగ్ ఎలా జరిగింది.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయని ప్రశ్నించగా.. ఆయన స్పందించి ‘‘ ఉదయం 8.45కి బూత్ నెంబర్ 588కి ఓటేసినా.. మా పార్టీ అభ్యర్థి సురభీ వాణీదేవికి ఓటేశాను..’’  అని మహమూద్ అలీ చెప్పారు. ఓటు వేసిన విషయం రహస్యంగా ఉంచాలన్న నిబంధనను పట్టించుకోకుండా చేసిన కామెంట్స్ పై వివాదం చెలరేగింది. 
ఓటు చెల్లుతుందా...?
సాక్షాత్తు హోం మంత్రి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడంపై దుమారం చెలరేపుతోంది. మలక్ పేట్ లో ఓటు వేసి బయటకు వచ్చిన  తర్వాత పోలింగ్ కేంద్రం బయట ఈ కామెంట్స్ మీడియాలో ప్రసారం కావడంతో సదరు క్లిప్పింగులతో ప్రతిపక్షాల నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేశారు. సాధారణంగా ఓటు వేసిన విషయం బహిరంగంగా చెప్పకూడదు. అయితే దీన్ని హోంమంత్రే ఉల్లంఘించడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. హోం మంత్రి దురుసుతనం దారుణమని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని, ఆయన వేసిన ఓటును చెల్లనిదిగా పరిగణించాలని ఫిర్యాదులు చేస్తున్నారు.