బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించాలి: నిరంజన్ రెడ్డి

బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించాలి: నిరంజన్ రెడ్డి

వనపర్తి, వెలుగు: పదేళ్ల బీఆర్ఎస్​ పాలనలో తెలంగాణ స్వరూపం మారిపోయిందని, అన్ని వర్గాల ప్రజలు ఆనందంతో ఉన్నారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆదివారం వనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్  వన్  స్థానంలో ఉందన్నారు.

బీజేపీ, కాంగ్రెస్  పాలిత రాష్ట్రాల్లో జనం ఆనందంగా లేరని, తెలంగాణ పథకాలు అమలు చేయాలని ఆయా రాష్ట్రాల ప్రజలు డిమాండ్  చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్, మంచి నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. పని చేసే కేసీఆర్  ప్రభుత్వానికి మరోసారి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మహ్మద్ హుస్సేన్ పల్లిలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు.