హైదరాబాద్​లో పీఎస్​ఆర్​ టెక్ హబ్ జీసీసీ : శ్రీధర్​బాబు

హైదరాబాద్​లో పీఎస్​ఆర్​ టెక్ హబ్ జీసీసీ :  శ్రీధర్​బాబు

హైదరాబాద్​, వెలుగు:  ఐటీ కంపెనీ పీఎస్​ఆర్​ టెక్ హబ్  హైదరాబాద్ సైబర్ ​గేట్‌‌వే వద్ద నిర్మించిన గ్లోబల్ డెలివరీ సెంటర్‌‌ను (జీసీసీ) రాష్ట్ర సమాచా ర సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యశాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు.  ప్రపంచవ్యాప్తంగా తమ ఖాతాదారులకు ఇక్కడి నుంచే ఉత్పత్తులను, పరిష్కారాలను,  సేవలను అందించడంలో ఇది కీలకమని కంపెనీ తెలిపింది.

 2016లో మైక్రో సేల్స్ స్టార్టప్‌‌గా ప్రారంభం అయినప్పటి నుంచి, పీఎస్​ఆర్​ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 220కిపైగా ఉద్యోగులు,  ఎనిమిది సెంటర్లతో  టెక్​ హబ్​గా అభివృద్ధి చెందింది.