కావాల్సినవి :
సేమ్యా : రెండు కప్పులు
పెరుగు : ఒక కప్పు
క్యారెట్, ఉల్లిగడ్డ, కొత్తిమీర తరుగు : ఒక్కోటి అర కప్పు చొప్పున
పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్
ఉప్పు : సరిపడా
నూనె : ఒక టేబుల్ స్పూన్
పోపు దినుసులు : ఒక టీస్పూన్
ఎండు మిర్చి : రెండు
కరివేపాకు : కొద్దిగా
తయారీ : ఒక గిన్నెలో పెరుగు, క్యారెట్, ఉల్లిగడ్డ, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలపాలి. పాన్లో నూనె వేడి చేసి పోపు దినుసులు, ఎండు మిర్చి, కరివేపాకు వేగించాలి. ఆ పోపుని పెరుగు మిశ్రమంలో వేయాలి. అందులో సేమ్యా కూడా వేసి కలిపి మూతపెట్టాలి. అలా ఐదు నిమిషాలు పక్కన పెట్టాక ఆ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లో సర్ది ఉడికించాలి.