దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వివిధ పార్టీల నాయకులు

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వివిధ పార్టీల నాయకులు

ఎల్కతుర్తి (కమలాపూర్)/ వర్ధన్నపేట/ పర్వతగిరి/ నల్లబెల్లి/ తాడ్వాయి, వెలుగు: మొంథా తుఫాన్​ వల్ల దెబ్బతిన్న పంటలను శుక్రవారం వివిధ పార్టీల నాయకులు పరిశీలించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్​ మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను కాంగ్రెస్​ హుజూరాబాద్​ నియోజకవర్గ ఇన్​చార్జి వొడితెల ప్రణవ్​ పరిశీలించారు. వరంగల్​ జిల్లా వర్ధన్నపేట, పర్వతగిరి, నల్లబెల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో బీఆర్​ఎస్​ స్థానిక నాయకులు నష్టపోయిన పంటలను పరిశీలించారు. ​

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఊరటం గ్రామ పరిధిలో దెబ్బతిన్న పంటలను తుడుందెబ్బ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతులను ఆదుకోవాలని, నష్టపరిహారం త్వరగా అందేలా చూడాలని అధికారులను కోరారు.