ఇద్దరు పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య

ఇద్దరు పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నూనావత్ తండాలో దారుణం చోటుచేసుకుంది..అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులకు  విషం ఇచ్చి హత్య చేసి, ఆపై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. వివరాల్లోకి వెళితే దామరచర్ల మండలం నునావత్ తండా లో కిషన్ నాయక్ అనే వ్యక్తి వ్యవసాయ పొలం వద్ద  తన ఇద్దరు కొడుకులు  హర్షవర్ధన్ ,అఖిల్ పురుగుల మందును  మజా కూల్ డ్రింక్ లో కలిపి ఇచ్చాడు. అది దాగిన పిల్లలు చనిపోయారు. అనంతరం తాను కూడా చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంభ కలహాలతోనే కిషన్ నాయక్ ఇంతటి దారుణానికి ఓడిగట్టడాని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కిషన్ ఆత్మహత్యకు భార్య వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. భార్య పై అనుమానం గతంలో అనేకసార్లు పంచాయితీ పెట్టాడు. అయితే భార్య తీరులో మార్పు రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు కుటుంబ సభ్యులు.