
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఎలాంటి విద్యార్హతలు లేకుండా పది మంది ఆర్ఎంపీలు రోగులకు అల్లోపతి ట్రీట్మెంట్ చేస్తుండగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీఎంసీ) కేసులు నమోదు చేసింది. గురువారం సాయంత్రం మీడియాకు టీఎంసీ వైస్చైర్మన్ డాక్టర్శ్రీనివాస్ వివరాలు తెలిపారు. బాన్స్వాడ టౌన్లో జాదవ్సుదర్శన్, ఎం. పరమేశ్వర్, గాంధారిలో కె.కస్తూరి అంజయ్య, ఎ. ఆంజనేయులు, కేతావత్హేమ్సింగ్, నల్ల నరేందర్పై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో అడుల గణేష్, రాజారామ్, ఎండీ అజీమ్, అమానుల్లా ఖాన్పై కేసులు పెట్టినట్టు ఆయన వెల్లడించారు.
టీఎంసీకి చెందిన డాక్టర్సన్నీ డేవిస్, డాక్టర్శిరీష్కుమార్, డాక్టర్కిరణ్కుమార్, విజిలెన్స్ ఆఫీసర్రాకేష్ చేపట్టిన తనిఖీల్లో రూల్స్కు విరుద్ధంగా ఆర్ఎంపీలుగా చెలామణి అవుతూ ట్రీట్మెంట్చేస్తున్నట్టు, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, యాంటి బయాటిక్ మెడిసిన్స్ పేషెంట్లకు ఇస్తున్నట్టు గుర్తించారు. గర్భిణులకు లింగ నిర్థారణ పరీక్షలు, అబార్షన్లు కూడా చేస్తున్నట్లు తేలింది. ప్రైవేట్ఆస్పత్రుల్లో వార్డ్బాయ్, ల్యాబ్టెక్నిషియన్, కంపౌండర్లుగా పనిచేసి ఆర్ఎంపీలుగా చెలామణి అవుతున్నారని వివరించారు. ఫేక్ డాక్టర్లపై 9154382727కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని వైస్ చైర్మన్ శ్రీనివాస్ కోరారు .