
మెదక్, వెలుగు:రాష్ట్ర కార్మిక, మైనింగ్మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి మంగళవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో ధూలపల్లిలోని ఆయన స్వగృహంలో భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చించారు. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ఇన్చార్జి పూజల హరికృష్ణ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొండపాక విజయ్ కుమార్ ఉన్నారు.
మంత్రి వివేక్ ను కలిసినకొమ్మూరి
చేర్యాల: మంత్రి వివేక్ను జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి శాలువా కప్పి సన్మానించారు. హైదరాబాద్లోని మంత్రి క్యాంప్ ఆఫీసులో కలిసిన కొమ్మూరి పలు అభివృద్ధి పనులపై చర్చించారు. చేర్యాల సబ్డివిజన్ లో నెలకొన్న సమస్యల గురించి వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందించి అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు కొమ్మూరి తెలిపారు.