మంత్రి వివేక్, మైనంపల్లి భేటీ

మంత్రి వివేక్, మైనంపల్లి భేటీ

మెదక్, వెలుగు:రాష్ట్ర కార్మిక, మైనింగ్​మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్​చార్జి మంత్రి గడ్డం వివేక్​ వెంకట్ స్వామి మంగళవారం కాంగ్రెస్​ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో ధూలపల్లిలోని ఆయన స్వగృహంలో భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చించారు. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్​ ఇన్​చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్​ఇన్​చార్జి పూజల హరికృష్ణ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొండపాక విజయ్ కుమార్ ఉన్నారు.

మంత్రి వివేక్ ను కలిసిన​కొమ్మూరి 

చేర్యాల: మంత్రి వివేక్​ను జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి శాలువా కప్పి  సన్మానించారు. హైదరాబాద్​లోని మంత్రి క్యాంప్​ ఆఫీసులో కలిసిన కొమ్మూరి పలు అభివృద్ధి పనులపై చర్చించారు. చేర్యాల సబ్​డివిజన్ లో నెలకొన్న సమస్యల గురించి వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందించి అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు కొమ్మూరి తెలిపారు.