బీఆర్​ఎస్​కే మా మద్దతు .. తెలంగాణ ముదిరాజ్​ మహాసభ

బీఆర్​ఎస్​కే మా మద్దతు .. తెలంగాణ ముదిరాజ్​ మహాసభ

ఖైరతాబాద్,వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజ్​లను అభివృద్ధి చేసిందని, ఆ పార్టీకే తాము మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ ముదిరాజ్​మహాసభ విద్యావంతుల వేదిక చైర్మన్​ ​సీహెచ్ దినేశ్ ​కుమార్ ​​తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో  ఆయన మాట్లాడారు. మత్య్సకారులను అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్  సర్కారు చెరువులను నింపి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసిందని పేర్కొన్నారు.  రాష్ట్రం ఏర్పడేనాటికి మత్స్యకారుల ఆదాయం రూ.2.479 కోట్లు మాత్రమే ఉంటే.. ప్రస్తుతం రూ.7,259 కోట్లకు పెరిగినట్లు చెప్పారు.