రెడ్కోకు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు

రెడ్కోకు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ (రెడ్కో)కు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు–-2023 లభించింది.  జాతీయ స్థాయిలో స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏ) కేటగిరీ (గ్రూప్-2)లో సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించడంతో పురస్కారం వరించింది.  గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రెడ్కో వీసీఎండీ నీలం జానయ్య, డిప్యూటీ జీఎం శ్రీనివాసులు అవార్డును అందుకున్నారు. స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీలోను రాష్ట్రం 78 పాయింట్ల స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించింది. రెడ్కో.. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్, గృహ, వాణిజ్య భవనాల్లో ఇంధన పొదుపును ప్రోత్సహించడం, రైతులతో పంపు సెట్ల నిర్వహణలో అవగాహన కల్పించి తనదైన పాత్ర పోషించింది. ప్రభుత్వం, బీఈఈ, సహకారశాఖలకు వీసీఎండీ జానయ్య కృతజ్ఞతలు తెలిపారు.