ఏపీ వైఖరిపై తెలంగాణ అభ్యంతరం

ఏపీ వైఖరిపై తెలంగాణ అభ్యంతరం

హైదరాబాద్, వెలుగు: బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై ఏపీ చేస్తోన్నవాదనను తెలంగాణ తప్పుపట్టింది. గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను తెలంగాణ అప్పగిస్తేనే.. తామూ ఇస్తామని ఏపీ మెలిక పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) చైర్మన్ కు రాష్ట్ర అధికారులు బుధవారం లెటర్ రాశారు.గెజిట్ ప్రకారం ఏపీ నడుచుకోకుండా.. తమతో లింక్​ పెట్టడం ఏంటని అధికారులు ప్రశ్నించారు. గోదావరిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు తప్పా..మరే ప్రాజెక్టును బోర్డుకు ఆప్పగించడానికి సిద్ధంగా లేమని తెలంగాణ స్పష్టం చేసింది. 
ఇటీవల జరిగిన గోదావరి బోర్డు ఉప కమిటీ సమావేశంలో 14 ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ జరిగింది. అందులో తెలంగాణకు చెందిన ప్రాజెక్టులు 4 కాగా..  10 ఏపీ ప్రాజెక్టులు ఉన్నాయి.