
బషీర్బాగ్, వెలుగు: పీఈటీ, పీడీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగుల, ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మాదగోని సైదులుగౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో డీఎస్సీ ద్వారా రెగ్యూలర్ పద్ధతిలో భర్తీ చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ ప్రకటించాలని కోరారు.